Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్ ఆర్టీసీ బస్సులో ఐదుగురికి ఉచిత ప్రయాణం

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (08:48 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)గా ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా, ఆర్టీసీ బస్సులను ప్రయాణికులు ఆకర్షించేలా పలు రాయితీలు కల్పిస్తున్నారు. తాజాగా మరో వినూత్న ఆఫర్‌తో ముందుకు వచ్చింది. 
 
శబరిమలకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సును బుక్ చేసుకున్నట్టయితే ఐదుగురికి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. అయ్యప్పభక్తులకు తక్కువ చార్జీలతో బస్సును అద్దెకు ఇవ్వడంతో పాటు ప్రతి బస్సులో ఇద్దరు వంట మనుషులు, పదేళ్లలోపు ఇద్దరు మణికంఠ స్వాములు, ఒక అటెండర్‌ ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి ఇస్తామని తెలిపింది. 
 
అలాగే, 36 సీట్ల సూపర్ లగ్జరీ బస్సుకు కిలోమీటరుకు రూ.48.96 వసూలు చేస్తారు. అలాగే, 40 సీట్ల డీలక్స్ బస్సుకు రూ.47.20, 48 సీట్ల డీలక్స్ బస్సుకు రూ.56.64, 49 సీట్ల ఎక్స్‌ప్రెస్ బస్సుకు రూ.52.43 చొప్పున చార్జీలను నిర్ణయించింది. ఈ బస్సులను కావాల్సిన అయ్యభక్తులు సమీపంలోని ఆర్టీసీ డిపోలు లేదా బస్ స్టేషన్లలో సంప్రదించాలని కోరింది. 
 
కాగా, ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే శుభకార్యాలకు బస్సులను అద్దెకు ఇస్తుంది. అతేకాకుండా ఏదేని కార్యానికి ఒకే కాలనీవారు బస్సును బుక్ చేసుకుంటే వారి కాలనీకే బస్సు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటుందని ఎండీ సజ్జనార్ ప్రకటంచిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments