శ్మశానంలో ఇద్దరు మహిళలు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు పెట్టి నలుగురు యువకులు...?

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (18:54 IST)
నల్గొండ హుజూర్ నగర్ మండలంలో గోవిందాపురంలో చేతబడి అనుమానంతో కొందరు యువకులను స్థానికులు చితకబాదారు. శ్రీకాంత్, రాము, రవి, వెంకటేశ్వర్లు అనే నలుగురు యువకులు గురువారం రాత్రి శ్మశానంలో క్షుద్ర పూజలు నిర్వహించారు. ఖమ్మం, ఒంగోలు ప్రాంతాలకు చెందిన భూతవైద్యులు మంత్రాలు చదవగా  యువకులు అదే మంత్రాలను పఠిస్తూ పూజలు చేశారు.
 
ఇది గమనించిన స్థానికులు వారిపై దాడికి దిగారు. దాంతో నలుగురిలో ఓ యువకుడు పారిపోయాడు. అయితే మరునాడు ఉదయం గ్రామస్తులు ఆ యువకుడిని పిలిపించి విచారించగా ఒకదానికొకటి సంబంధం లేని సమాధానాలు చెప్పసాగాడు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు యువకులను చితకబాదారు.
 
 అనుమానం చెందిన గ్రామస్తులు వారిని శ్మసానానికి తీసుకెళ్లి చూపించమన్నారు. అక్కడ సోదాలు చేయగా మట్టిలో పూడ్చిన ఇద్దరు మహిళలు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ఓ చీర, జాకెట్, నిమ్మకాయలు, వెంట్రుకలు, రెండు నళ్ల కోళ్లు కనిపించాయి. దాంతో యువకులు క్షుద్ర పూజలు చేస్తున్నారని పోలీసులకు వారిని అప్పగించారు.
 
ఆ యువకులు చెప్పింది విన్న ఎస్సై వారిని మందలించి పంపేశారు. ఆ ఫోటోలు తమ కుటుంబానికి చెందినవారివేనని, తమ కుటుంబంలో కొన్నాళ్లుగా సమస్యలున్నాయని వాటికి పరిష్కారంగా పూజలు నిర్వహిస్తే తొలగిపోతుందని ఒంగోలుకు చెందిన ఓ పూజారి చెప్పడంతో ఆ పూజలు నిర్వహించామని యువకులు తెలిపారు. తాము చేతబడి చేస్తున్నామని గ్రామస్తులు మమ్మల్ని కొట్టారని యువకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments