Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో నలుగురి కిడ్నాప్

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (21:59 IST)
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన జితేందర్ రెడ్డికి చెందిన ఢిల్లీ నివాసంలో నలుగురు కిడ్నాప్‌కు గురయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉండే వారిలో ఏకంగా నలుగురు కిడ్నాప్‌కు గురికావడం ఇపుడు కలకలం రేపుతుంది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కిడ్నాప్‌కు గురైనవారిలో జితేందర్ రెడ్డి కారు డ్రైవర్‌తో సహా నలుగురు ఉన్నారు. ఈ కిడ్నాప్ ఘటనపై జితేందర్ రెడ్డి ఢిల్లీ ఫిర్యాదు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీ సౌత్ అవెన్యూలోని 105 నంబరు ఇంటిలో జితేందర్ రెడ్డి నివాసం ఉంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి జితేందర్ రెడ్డి కారు డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులను బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న జితేందర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది సమీపంలోని పోలీస్ స్టేషనుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments