Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి ఫరీదుద్దీన్ మృతి - సీఎం కేసీఆర్ సంతాపం

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (10:08 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మహ్మద్ ఫరీదుద్దీన్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన 64 యేళ్ల ఆయన హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స  పొందుతూ వచ్చారు. అయితే, ఆయనకు బుధవారం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
కాగా, గత 2004లో జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఫరీదుద్దీన్ విజయం సాధించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మైనార్టీ సంక్షేమ శాఖామంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి శాసనమండలి సభ్యుడుగా అడుగుపెట్టారు. 
 
ఆయన మృతిపట్ల తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు ఆయన తన సానుభూతిని తెలిపారు. మైనార్టీ నేతగా ఆయన మంత్రిగానేకాకుండా ఒక రాజకీయ నేతగా విశేష సేవలు అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments