Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో దొంగల బీభత్సం - ఎస్బీఐ ఉద్యోగిని కాల్చి దోపిడీ

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (09:33 IST)
ముంబై మహానగరంలోని దహిసర్ వెస్ట్‌లో ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. ఇద్దరు దుండగులు తుపాకీలతో బ్యాంకులోకి ప్రవేశించి ఉద్యోగులను బెదిరించి నగదును దోచుకున్నారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ ఉద్యోగిని నిర్దాక్షిణ్యంగా కాల్చివేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు బ్యాంకులోని వారిని బెదిరించడానికి ఒక ఉద్యోగిపై కాల్పులు కూడా జరిపారు. దీంతో ఆ ఉద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడుు. అంతేకాకుండా, మిగితా బ్యాంకు ఉద్యోగులను బెదిరించి 2.5 లక్షల నగును కూడా దోచుకున్నారు. 
 
ఈ దోపిడీ గురించి పోలీసులకు సమాచారం అందించడంతో హూటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంకులో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ దోపిడీ దొంగల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments