Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి వ్యాక్సిన్‌ను తెలంగాణకు ఇవ్వాలి.. ఈటెల డిమాండ్

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (12:08 IST)
ప్రపంచమంతా కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ తయారీలో కీలక దశకు చేరుకున్నాయి. కరోనాకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో హైదరాబాద్‌లో ఉన్న భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌-ఈ, తదితర కంపెనీలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి.
 
అయితే నగరం నుండి వ్యాక్సిన్ తయారీ అవుతున్న కారణంగా ముందుగా వ్యాక్సిన్‌ను తెలంగాణ ప్రజలకే ఇవ్వాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీని ఈటెల కోరారు. ఇక్కడి ప్రజలకు సరిపోయేన్ని డోసులను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 
 
కరోనా భయం పూర్తిగా పోవాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గం కాబట్టి ప్రజలందరికీ అతి త్వరలో వ్యాక్సిన్‌ అందేలా చూడాలని ప్రధానిని ఈటెల కోరారు. హైదరాబాద్‌ నుంచి వ్యాక్సిన్‌ అభివృద్ధికి భారత్‌ బయోటెక్‌ చేస్తున్న కృషి తుదిదశకు చేరుకుంది. 
 
ఇప్పటికే మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతుండగా, వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. ఫార్మారంగానికి తెలంగాణ చూపిన చొరవకు కృతజ్ఞతగా, ప్రపంచానికి కరోనా నుంచి విముక్తి కల్పిస్తున్న సందర్భంగా.. తొలి వ్యాక్సిన్‌ను తమకే ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments