Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాప్ నిర్వాహకుల వేధింపులకు ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (09:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఈ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లికుదురు మండలం కొండెంగలగుట్ట తండాకు చెందిన బానోతు అచ్చాలి - కుస్సా దంపతుల కుమారుడు ఆకాశ్ (22) హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 
 
ఈ విద్యార్థి కొన్ని నెలల క్రితం ఒక రుణ యాప్ ద్వారా రూ.30 వేల రుణం తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు నుంచి ఒత్తిడితో పాటు వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా, పొదుపు సంఘం నుంచి రుణం తీసుకుని చెల్లిద్దామని చెప్పాడు. 
 
ఇంతలో యాప్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చిన ఆకాశ్.. ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోనే చీరతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments