Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాప్ నిర్వాహకుల వేధింపులకు ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (09:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఈ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లికుదురు మండలం కొండెంగలగుట్ట తండాకు చెందిన బానోతు అచ్చాలి - కుస్సా దంపతుల కుమారుడు ఆకాశ్ (22) హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 
 
ఈ విద్యార్థి కొన్ని నెలల క్రితం ఒక రుణ యాప్ ద్వారా రూ.30 వేల రుణం తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు నుంచి ఒత్తిడితో పాటు వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా, పొదుపు సంఘం నుంచి రుణం తీసుకుని చెల్లిద్దామని చెప్పాడు. 
 
ఇంతలో యాప్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చిన ఆకాశ్.. ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోనే చీరతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments