Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాది కొత్తగూడెం జిల్లాను వణికిస్తున్న వరుస ఎన్‌కౌంటటర్లు, ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (12:07 IST)
భద్రాది కొత్తగూడెం జిల్లాను వరుస ఎన్‌కౌంటర్లు వణికిస్తున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందోనని ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు. చత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణలో అడుగుపెట్టిన మావోలను నియంత్రించాలని పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుడు చనిపోయాడు.
 
ఈ  ఘటన జరిగిన నాలుగు రోజులకే మరో ఎన్‌కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. ఈ రెండు ఘటనలతో అడవి ప్రాంతాలలో అలజడి మొదలైంది. తెలంగాణలో అధికార పార్టీ నాయకులే లక్ష్యంగా మావోలు వ్యూహ రచన చేస్తుండడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పదిరోజుల క్రితం మావోయిస్టుల యాక్షన్ టీం సభ్యుడు ఎన్ కౌంటర్లో మరణించాడు.
 
కొత్తగూడెం ఇల్లందుల ఏరియాల్లో మావోలు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు. దీంతో కొత్తగూడెం సుదూర ప్రాంతపు అడవుల్లో తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. వరుస ఎన్‌కౌంటర్లు కారణంగా ఏజెన్సీ పల్లెల్లో నిఘా మరింత పెంచారు. అనుమానస్పదంగా తిరుగుతున్న వారిపై ఫోకస్ పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments