Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహామ్మారికి మరో నటుడు బలి..

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (12:01 IST)
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. ఈ లాక్‌‌డౌన్‌ సడలింపులతో వైరస్‌ మరింతగా వేగంగా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజుకు సరాసరి లక్ష కేసులు నమోదువుతున్నాయి. కరోనా బారిన పడి పేదధనిక తేడా లేకుండా ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. కొందరు ఈ మహామ్మారి బారిన పడి కన్ను మూస్తున్నారు. ఇప్పటికే దిలీప్ కుమార్ తమ్ముడు సహా పలువురు ప్రముఖలు కోవిడ్ కారణంగా కన్నుమూసారు. 
 
తాజాగా కరోనా మహామ్మారి మరో నటుడిని బలి తీసుకుంది. తమిళం, మలయాళంలో తన నటనతో ఆకట్టుకున్న ఫ్లోరెంట్ పెరిరా అనే నటుడు కరోనా కారణంగా సోమవారం మరణించారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. తమిళంలో ప్రముఖ కారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫ్లోరెంట్ పెరిరాకు మంచి ఇమేజ్ ఉంది. 
 
రాజా మందిరి, ధర్మదురై వంటి చిత్రాల్లో ఈయన నటించారు. ఈయన కలైజ్ఞర్ టీవీ ఛానెల్‌కు కొన్నాళ్లు జనరల్ మేనేజర్‌గా పనిచేసారు. ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నారు. ఈయన మృతికి తమిళనాడుకు చెందిన సినీనటులుతో పాటు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments