Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోయిన ఈనాడు విలేకరి: కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి హరీశ్ రావు

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (18:02 IST)
కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభణ బీభత్సాన్ని సృష్టిస్తోంది. గతంలో కరోనా సోకినా హోం క్వారెంటైన్లో వుండి క్రమంగా కోలుకున్న పరిస్థితులు వున్నాయి. కానీ సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా వుంటోంది. ఎంతోమంది పొట్టనబెట్టుకుంటోంది. ఈనాడులో గత పదిహేడేళ్లుగా కంట్రిబ్యూటర్‌గా విధులు నిర్వర్తించే చింతా నాగరాజుకి కరోనా సోకింది.
 
దుబ్బాకకు చెందిన నాగరాజుకి పది రోజుల క్రితం కరోనా వచ్చింది. దీనితో మెరుగైన చికిత్స చేయించుకునేందుకు హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. ఐతే బుధవారం నాడు వున్నట్లుండి తీవ్ర అస్వస్థతకు లోనై ప్రాణాలు విడిచారు.
 
43 ఏళ్ల చింతా నాగరాజు మరణం పట్ల తెలంగాణ మంత్రి హరీశ్ రావు కంటతడి పెట్టుకున్నారు. ఆత్మీయుణ్ణి కోల్పాయానని ఆవేదన వ్యక్తం చేసారు. నాగరాజు మరణించడానికి ఓ గంట ముందు కూడా అతడితో మాట్లాడాననీ, తిరిగి కోలుకుంటారని అనుకున్నాననీ, కానీ ఆయనను కాపాడుకోలేకపోయామని అన్నారు. నాగరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments