Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ చికిత్సకు మందుల కొరత లేకుండా చూడండి: మంత్రి ఈటెల

Webdunia
శనివారం, 18 జులై 2020 (17:15 IST)
తెలుగు రాష్ట్రంలో కరోనా శరవేగంలో విస్తరిస్తున్నది. దీనిని అదుపు చేయడానికి ప్రభుత్వం పగడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. కరోనావైరస్ వ్యాధిని నియంత్రించేందుకు సీఎం కేసీఆర్ రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. దీనికితోడు పలుచోట్ల కరోనా పరీక్ష కేంద్రాలను విస్తృత పరిచింది. ఈ క్రమంలో తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ అధికారులతో ఇప్పటివరకు ఎన్నో సమీక్షలు నిర్వహించారు.
 
ఈ సమీక్షలో కరోనా మహమ్మారి బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, వైరస్ బారిన పడిన వారికి అందించే వైద్యం గురించి పలు చర్చలు జరిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు దావాఖానాల్లో మందుల కొరతపై సమీక్ష నిర్వహించారు. శనివారం ఆయన నిర్వహించిన సమావేశంలో ఫార్మా డీలర్లు, అధికారులు హాజరయ్యారు. అందులో విటమిన్ డి, సి, మల్టి విటమిన్, జింక్ వంటి ఔషధాలను మందుల దుకాణాలలో అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.
 
కరోనా చికిత్స కోసం ఉపయోగించే డాక్సామెతాసోన్, మిథైల్‌ప్రెడ్నిసోలాన్, అజిత్రోమైసిన్, డాక్సీసైకిన్ వంటి మందులు వీలైనంత తొందరగా సరఫరా చేయాలని కోరారు. ఇందులో జాప్యం వహించరాదని సూచించారు. అదేవిధంగా కరోనా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments