Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ చికిత్సకు మందుల కొరత లేకుండా చూడండి: మంత్రి ఈటెల

Webdunia
శనివారం, 18 జులై 2020 (17:15 IST)
తెలుగు రాష్ట్రంలో కరోనా శరవేగంలో విస్తరిస్తున్నది. దీనిని అదుపు చేయడానికి ప్రభుత్వం పగడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. కరోనావైరస్ వ్యాధిని నియంత్రించేందుకు సీఎం కేసీఆర్ రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. దీనికితోడు పలుచోట్ల కరోనా పరీక్ష కేంద్రాలను విస్తృత పరిచింది. ఈ క్రమంలో తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ అధికారులతో ఇప్పటివరకు ఎన్నో సమీక్షలు నిర్వహించారు.
 
ఈ సమీక్షలో కరోనా మహమ్మారి బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, వైరస్ బారిన పడిన వారికి అందించే వైద్యం గురించి పలు చర్చలు జరిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు దావాఖానాల్లో మందుల కొరతపై సమీక్ష నిర్వహించారు. శనివారం ఆయన నిర్వహించిన సమావేశంలో ఫార్మా డీలర్లు, అధికారులు హాజరయ్యారు. అందులో విటమిన్ డి, సి, మల్టి విటమిన్, జింక్ వంటి ఔషధాలను మందుల దుకాణాలలో అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.
 
కరోనా చికిత్స కోసం ఉపయోగించే డాక్సామెతాసోన్, మిథైల్‌ప్రెడ్నిసోలాన్, అజిత్రోమైసిన్, డాక్సీసైకిన్ వంటి మందులు వీలైనంత తొందరగా సరఫరా చేయాలని కోరారు. ఇందులో జాప్యం వహించరాదని సూచించారు. అదేవిధంగా కరోనా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments