Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ చికిత్సకు మందుల కొరత లేకుండా చూడండి: మంత్రి ఈటెల

Webdunia
శనివారం, 18 జులై 2020 (17:15 IST)
తెలుగు రాష్ట్రంలో కరోనా శరవేగంలో విస్తరిస్తున్నది. దీనిని అదుపు చేయడానికి ప్రభుత్వం పగడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. కరోనావైరస్ వ్యాధిని నియంత్రించేందుకు సీఎం కేసీఆర్ రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. దీనికితోడు పలుచోట్ల కరోనా పరీక్ష కేంద్రాలను విస్తృత పరిచింది. ఈ క్రమంలో తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ అధికారులతో ఇప్పటివరకు ఎన్నో సమీక్షలు నిర్వహించారు.
 
ఈ సమీక్షలో కరోనా మహమ్మారి బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, వైరస్ బారిన పడిన వారికి అందించే వైద్యం గురించి పలు చర్చలు జరిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు దావాఖానాల్లో మందుల కొరతపై సమీక్ష నిర్వహించారు. శనివారం ఆయన నిర్వహించిన సమావేశంలో ఫార్మా డీలర్లు, అధికారులు హాజరయ్యారు. అందులో విటమిన్ డి, సి, మల్టి విటమిన్, జింక్ వంటి ఔషధాలను మందుల దుకాణాలలో అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.
 
కరోనా చికిత్స కోసం ఉపయోగించే డాక్సామెతాసోన్, మిథైల్‌ప్రెడ్నిసోలాన్, అజిత్రోమైసిన్, డాక్సీసైకిన్ వంటి మందులు వీలైనంత తొందరగా సరఫరా చేయాలని కోరారు. ఇందులో జాప్యం వహించరాదని సూచించారు. అదేవిధంగా కరోనా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments