Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంసెట్‌‍లో వెయిటేజీ మార్కులు శాశ్వతంగా రద్దు.. తెలంగాణ సర్కారు నిర్ణయం?

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (10:16 IST)
ఎంసెట్‌లో ఇంటర్ మార్కుకు 25 శాతం వెయిటేజీని ఇస్తూ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇకపై ఈ వెయిటేజీ మార్కులను శాశ్వతంగా తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కరోనా ప్రభావంతో గత మూడేళ్ల నుంచి ఎంసెట్ ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఇదే విధానాన్ని పాటించాలని నిర్ణయించారు. దీనిపై తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. 
 
జేఈఈ వంటి వాటిల్లో మార్కుల వెయిటేజీ పద్దతి లేకపోవడంతో ఎంసెట్‌లో కూడా దీన్ని తొలగించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీంతో ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఇక ఎంసెట్ పరీక్షలో మొదట గణితం, ఆ తర్వాత ఫిజిక్స్, చివరగా కెమిస్ట్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించారు. 
 
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వస్తున్నందన ఒకటికి మించి ఎక్కువ ప్రశ్నపత్రాలు ఉండటంతో మార్కులు కాకుండా పర్సంటైల్‌ను లెక్కిస్తున్నారు. ఈ పర్సంటైల్ కూడా ఒకటే వస్తే పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకుని ఎవరు పెద్దవారు అయితే వారికి మెరుగైన ర్యాంకులు కేటాయిస్తున్నారు. ఇపుడు ఈ వెయిటేజీ మార్కులను శాశ్వతంగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఈ యేడాది మే 7 నుంచి 14వ తేదీ వరకు తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments