బోల్తాపడిన డబుల్ డెక్కర్ బస్సు - ముగ్గురి మృతి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (09:50 IST)
ఢిల్లీ నుంచి బీహార్  వెళుతున్న డబుల్ డెక్కర్ బస్సు ఒకటి అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. యమునా ఎక్స్‌ప్రెస్ హైవేలోని 88వ మైల్ స్టోన్ వద్ద ఈ ప్రమాదం బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాద స్థలిలోనే ముగ్గురు చనిపోగా, మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి 12 గంటల సమయంలో జరిగింది. 
 
శివప్రకాష్ అనే ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన డబుల్ డెక్కర్ బస్సు ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి బీహార్‌కు కొందరు ప్రయాణికులతో బయలుదేరింది. ఈ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్ హైవేలో వెళుతుండగా, 88వ మైల్ స్టోన్ వద్ద అదుబుతప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులను ఇంకా గుర్తించలేదని డీఎం పుల్కిత్ ఖరే వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments