హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్. రాజధాని నగర రహదారులపై ఇకపై డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఈ డబుల్ డెక్కర్ బస్సులు సికింద్రాబాద్- మేడ్చల్, సికింద్రాబాద్- బాలానగర్, లింగంపల్లి, అప్జల్గంజ్ - మెహిదీపట్నం, జీడిమెట్ల- సీబీఎస్, పటాన్ చెరు మార్గాల ద్వారా ఈ బస్సు నడుస్తుంది. 
 
									
										
								
																	
	 
	అంతేకాకుండా నగర రోడ్లపై తిరిగే డహుల్ డెక్కర్ బస్సులన్నీ ఏసీవే కావడం గమనార్హం. ఈ బస్సుల కోసం టెండరు ఈ నెల 21వ తేదీన పూర్తి కానుంది. ఇప్పటికే రూటు సర్వేలు కూడా పూర్తి చేశారు. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	అద్దె ప్రాతిపదికన 10 డబుల్ డెక్కర్తో పాటు 350 ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకుంటోంది. ఎలక్ట్రిక్ బస్సులు అన్ని మార్గాల్లో తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది.