Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత..

bhageeratha reddy
, బుధవారం, 2 నవంబరు 2022 (21:04 IST)
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన భగీరథ బుధవారం చికిత్స ఫలించక కన్నుమూశారు. హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు వైకాపా ధ్రువీకరించింది. 
 
చల్లా భగీరథ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 46 ఏళ్ల వయసుకే ఆయన ఈ లోకాన్ని విడవడం పట్ల వైసీపీ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. 
 
భగీరథ రెడ్డి అంత్యక్రియలు రేపు (నవంబరు 3) కర్నూలు జిల్లా అవుకులో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. చల్లా భగీరథ రెడ్డి దివంగత వైసీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లిక్కర్‌కు బానిసైన వానరం.. బీర్‌ను భలే తాగేస్తోంది.. ఎక్కడ?