కేసీఆర్‌పై మండిపడిన డీకే అరుణ.. కోట్లతో ఓట్లు కొనుక్కోవడమే తెలుసు

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (16:59 IST)
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచేసిన అవినీతి సొమ్మంతా ఉందని.. ఆ డబ్బుతో ఎలాగైనా టీఆర్ఎస్ గెలవాలని చూస్తోందన్నారు డీకే అరుణ. నాదే అధికారం అనే గర్వం, భ్రమలో కేసీఆర్ ఉన్నారని మండిపడ్డారు. 
 
కిషన్ రెడ్డి ర్యాలీలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఉప ఎన్నిక చూసి భయపడుతావా అంటూ కౌంటర్లు వేశారు. కేసీఆర్ కు ఎన్నికలు అంటే కోట్లతో ఓట్లు కొనుక్కోవడమే తెలుసని చురకలంటించారు.
 
అసలు.. కేసీఆర్‌ను చూస్తుంటే జాలేస్తోందన్నారు డీకే అరుణ. గెలుపు కోసం రోజుకో అబద్ధం ఆడుతున్నారని ఆరోపించారు. దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి ఇచ్చే ఉద్దేశం లేక, అమలు చేయలేక బీజేపీ మీద ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఖజానా మొత్తం ఖాళీ చేసి ప్రభుత్వ భూములు అమ్ముతున్న కేసీఆర్ కు.. దళిత బంధు డబ్బులు ప్రజలకు ఇచ్చే ఉద్దేశమే లేదని చెప్పారు.
 
బీజేపీ మొదట్నుంచి దళిత బంధును పేదలందరికీ అందజేయాలని డిమాండ్ చేస్తోందన్నారు డీకే అరుణ. పథకం ప్రకటించి రెండు నెలలు అయినా ఏం చేశారని నిలదీశారు. కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెబుతారన్న నమ్మకం ఉందని తెలిపారామె.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమకి పులిహోర కలిపుకుంటున్న తరుణ్ భాస్కర్, మానస చౌదరి

Dhanush: కరసామిగా ధ‌నుష్ పోరాటం ఎవరిపైనే తెలియాలంటే టీజర్ చూడాల్సిందే

నాకు ఏమైనా జరిగితే ఆ నలుగురు రే బాధ్యులు :దర్శకుడు షెరాజ్ మెహదీ

Ritesh Rana: క్రేజీ మోహన్ కామెడీ స్టైల్ నాకు చాలా ఇష్టం : రితేష్ రానా

ఫెమినా కవర్ పేజీలో ధురందర్ హీరోయిన్ సార్ అర్జున్.. స్టార్‌డమ్ అదిరిందిగా.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు

ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే

ఫస్ట్ లుక్: స్టెల్లా మెక్‌కార్ట్‌నీ హెచ్ అండ్ ఎం కలెక్షన్‌ని లాంచ్ చేసిన హెచ్ అండ్ ఎం

తర్వాతి కథనం
Show comments