Webdunia - Bharat's app for daily news and videos

Install App

లారీకి పట్టకప్పి ఘాతుకానికి పాల్పడ్డారు... సి.సి.కెమెరాలో లారీ

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (21:40 IST)
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు నలుగురిని ఎన్ కౌంటర్ చేసినా సరే ఆ యువతి పడిన బాధ అందరినీ కలచివేస్తోంది. పోలీసుల విచారణలో ఆ యువకులు చెప్పిన మాటలు అలాంటివి. మొదట్లో నలుగురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత లారీలోను అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు.
 
గంటన్నరపాటు అతి దారుణంగా దిశకు నరకం చూపించిన ఆ మృగాళ్ళు ఆ తరువాత లారీలోను అత్యాచారానికి పాల్పడ్డారు. దిశ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో లారీలో అత్యాచారం జరిగిన సమయంలో పట్ట కప్పినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సి.సి. ఫుటేజ్‌ను పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. లారీ కదిలినప్పటి నుంచే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
 
అయితే పట్ట కప్పి ఉండడం.. పూర్తిగా చీకటి కావడంతో ఎవరూ కూడా ఈ మృగాళ్ళ అకృత్యాలను గుర్తించలేకపోయారు. దీంతో దిశ చివరకు ప్రాణాలను కోల్పోయింది. నిందితులను ఎన్ కౌంటర్ చేసినా మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల్లో మాత్రం ఈ ఘటనపై ఇప్పటికీ ఆగ్రహావేశాలు ఏమాత్రం తగ్గడంలేదు. ఒంటరిగా ఉన్న ఒక యువతిపై ఇంత దారుణానికి మృగాళ్ళు పాల్పడటం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

తర్వాతి కథనం
Show comments