Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ ఎఫెక్ట్.. హైదరాబాద్ చివర్లో 4 పెట్రోలింగ్ వాహనాలు

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (08:45 IST)
దిశ ఘటన తర్వాత హైవేలపై భారీ  భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. హైవేలపై ఎప్పటి కప్పుడు నిఘా కొనసాగించేలా పెట్రోలింగ్‌ వాహనాలను ప్రవేశపెట్టారు.

హైదరాబాద్ శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు పెట్రోలింగ్‌ కోసం 4 పోలీస్‌ వాహనాలను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ గురువారం ప్రారంభించారు. నాలుగు పెట్రోలింగ్‌ వాహనాలతో శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ మార్గంలో 24 గంటల గస్తీ ఉంటుందని తెలిపారు.

ఇంకా హైవేపై ప్రమాదాలు జరిగితే…వెంటనే స్పందించేందుకు ఇవి ఉపయోగపడుతాయని తెలిపారు. గాయపడిన వారిని త్వరగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు అవకాశముందన్నారు. హైవే పెట్రోలింగ్‌ నిర్వహించే గస్తీ టీంలకు కార్పోరేట్‌ ఆస్పత్రిలో ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపారు. హైవేపై ప్రమాదాలు ఆరికట్టే ఉద్దేశంతోనే ఈ వాహనాలు ప్రవేశపెట్టామన్నారు.
 
ఎవరికి ఇబ్బందులు కలిగినా వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని విజ్ఞప్తి సీపీ సజ్జనార్‌ చేశారు. త్వరలోనే బాలానగర్‌, మొయినాబాద్‌ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ వాహానాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments