Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ మద్యం కుంభకోణం : ఈడీ చార్జిషీటులో కవిత - మాగుంట - శరత్‌ చంద్రారెడ్డి పేర్లు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (09:37 IST)
ఢిల్లీ మద్యం కుంభకోణంలో భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవిత, ఏపీలోని వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిల పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తయారు చేసిన చార్జిషీటులో చేర్చింది. ఇందులో పేర్కొన్న అంశాలపై జనవరి ఐదో తేదీలోపు వివరణ ఇవ్వాలని సమీర్ సంస్థలకు కోర్టు ఆదేశించింది.
 
ఢిల్లీ లిక్కర్ స్కాములో అరెస్టు అయిన సమీర్ మహేంద్రు కేసులో ఈడీ చార్జిషీటును దాఖలు చేసింది. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేర్లు చేర్చింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన సమీర్ మహేంద్రు. పి.శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, విజయ్ నాయర్, బోయినపల్లి అభిషేక్‌ల నుంచి తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా ఈ చార్జిషీటును ఈడీ రూపొందించింది. 
 
ఇందులో గత యేడాది జనవరి నెలలో హైదరాబాద్ నగరంలోని కవిత ఇంట్లో సమీర్ ఆమెతో సమావేశమైనట్టు పేర్కొంది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, అరుణ్ పిళ్లైతో వ్యాపారం చేయడమంటే కవితతో చేసినట్టేనని సమీర్‌కు హామీ ఇచ్చారని తెలిపింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments