Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మొబైల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు: కవితకు సూటి ప్రశ్న

kkavitha
, సోమవారం, 12 డిశెంబరు 2022 (10:19 IST)
ఢిల్లీ మద్యం స్కామ్‌లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వద్ద ఆదివారం సీబీఐ అధికారులు ఏడున్నర గంటల పాటు సుధీర్ఘంగా విచారణ జరిపారు. ఈ విచారణలో అధికారులు సంధించిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, లిక్కర్ స్కామ్‌తో ఆమెకున్న సంబంధాలపై పక్కా ఆధారాలను చూపించి ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మొబైల్ ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారంటూ ప్రశ్నించారు. అలాగే, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఎలా పరిచయమయ్యారు.. సౌత్ గ్రూపు అంటే ఏంటి? వంటి అనేక అంశాలప 40 నుంచి 50 వరకు ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు ముందు హైదరాబాద్ - ఢిల్లీ ప్రయాణ వివరాలను ఇవ్వాలని కోరారు. మొత్తం ఏడున్నర గంటల పాటు విచారణ జరిపిన తర్వాత సీఆర్పీసీ 91 కింద నోటీసు ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.80 వేల కోట్లతో 500 విమానాలు .. ఎయిరిండియా ప్లాన్