Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైనేజీ గుంతలో పడి గల్లంతైన టెక్కీ మృతదేహం లభ్యం

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (18:34 IST)
డ్రైనేజీ గుంతలో పడి గల్లంతైన టెక్కీ మృతదేహాన్ని గోల్డెన్ టెంపుల్‌కు సమీపంలో ఉన్న నెక్నంపూర్‌ చెరువులో పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మణికొండలో నివాసముండే గోపిశెట్టి రజనీకాంత్‌ (42) షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో ఆయన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 
 
శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్‌ తన ఇంటికి 50 మీటర్ల దూరంలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యాడు. ఇలా మణికొండలో నాలాలో శనివారం కొట్టుకుపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతదేహం లభ్యమైంది. 
 
రజనీకాంత్ డ్రైనేజీలో కొట్టుకుపోయారనే సమాచారంతో రెండు డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయచర్యల్లో పాల్గొన్నాయి. నాలాలు కలిసే చోట, నెక్నాంపూర్‌ చెరువు వద్ద గాలింపు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం చెరువులో ఆయన మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గుర్తించి వెలికితీశారు. రజనీకాంత్‌ కోసం రెండ్రోజులుగా 60 మంది సిబ్బంది గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments