అవయవ మార్పిడి పేరుతో పారిశ్రామికవేత్తకు రూ.6 కోట్ల కుచ్చుటోపీ!

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (14:10 IST)
తెలంగాణ రాష్ట్రంలో అవయవమార్పిడి పేరుతో బాధితులకు ఆర్థిక సాయం చేయం పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ పారిశ్రామికవేత్తకు ఏకంగా రూ.6 కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టారు. దీనిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి రసాయనిక ఎరువుల సంస్థ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌)లో భాగంగా ఆ సంస్థ తరపున అనాథలు, స్వచ్ఛంద సంస్థలకు సాయం అందిస్తుంటారు. 
 
ఈ క్రమంలో గతేడాది జూన్‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఆసుపత్రి ప్రతినిధిని అంటూ ఓ మహిళ ఎండీకి ఫోన్‌ చేసింది. ఒకరికి అవయవ మార్పిడి చేయాల్సి ఉందని, అందుకు ఆర్థికసాయం అందించాలంటూ కోరింది. వాస్తవమేనని భావించిన ఆ వ్యక్తి మహిళ సూచించిన ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలకు గత జూన్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ ఆన్‌లైన్‌లో రూ.6.69 కోట్లు పంపించారు.
 
సీఎస్‌ఆర్‌ కింద ఈ సాయం వివరాలు చేర్చేందుకు ఆ వ్యక్తి బిల్లులు, ఇతర ఆధారాలు పంపాలని మహిళను కోరారు. దీంతో ఆమె స్పందించకపోవడంతో ఇటీవల గట్టిగా అడిగారు. అప్పటి నుంచి సైబర్‌ నేరగాళ్లు ఆ వ్యక్తి మొబైల్‌ ఫోనుకు అభ్యంతరకర చిత్రాలు, సందేశాలు పంపడం ప్రారంభించారు. 
 
డబ్బులు మళ్లీ డిమాండ్‌ చేస్తే మార్ఫింగ్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. దీంతో ఆ మహిళ చెప్పిందంతా బూటకమని తెలుసుకున్న ఎండీ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments