Webdunia - Bharat's app for daily news and videos

Install App

200 మంది ఐటీ ఉద్యోగుల్ని రోడ్డున పడేసిన వెరిజాన్, ఉద్యోగులు గగ్గోలు...

సాప్ట్వేర్ ఉద్యోగం ఇదివరకు ఓ బంగారు కలల సౌధంలా కనిపించేది. ఇప్పుడు అదే ఉద్యోగంలో చేసేవారు చాలామంది బిక్కుబిక్కుమంటున్నారు. ఐటీ రంగంలో పోటీ ఎక్కువ కావడం ఒకవైపు, నానాటికీ ఈ కోర్సులను చేసేవారు ఎక్కువ సంఖ్యలో వుండటంతో పరిస్థితి దిగజారుతోంది. మాదాపూర్‌ ఐట

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (21:20 IST)
సాప్ట్వేర్ ఉద్యోగం ఇదివరకు ఓ బంగారు కలల సౌధంలా కనిపించేది. ఇప్పుడు అదే ఉద్యోగంలో చేసేవారు చాలామంది బిక్కుబిక్కుమంటున్నారు. ఐటీ రంగంలో పోటీ ఎక్కువ కావడం ఒకవైపు, నానాటికీ ఈ కోర్సులను చేసేవారు ఎక్కువ సంఖ్యలో వుండటంతో పరిస్థితి దిగజారుతోంది. మాదాపూర్‌ ఐటీ కారిడార్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వాకానికి 200 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వీరితో సదరు కంపెనీ బలవంతంగా సంతకాలు చేయించి రాజీనామా చేయించినట్లు ఆరోపణలు చేస్తున్నారు. 
 
వెరిజాన్‌ డాటా సర్వీసెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌(వీడీఎస్‌) ఈ పనికి పూనుకున్నదని పోలీసులను ఆశ్రయించారు బాధితులు. తమను ఒక్కొక్కరిని గదిలోకి పిలిపించి బలవంతంగా రాజీనామా పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 
 
రిజైన్ పత్రాలపై సంతకం చేయనివారి పట్ల బౌన్సర్లతో భౌతిక దాడులు చేసేందుకు సైతం వారు వెనుకాడలేదంటూ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనీసం తమ వస్తువులను తీసుకునేందుకు సైతం అవకాశం ఇవ్వకుండా గెంటివేశారంటూ వాపోయారు. కాగా ఐటీ ఉద్యోగులకు భద్రత కల్పించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments