Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌ సోకి మహిళ మృతి .. 800 మంది కార్మికులకు క్వారంటైన్

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (14:12 IST)
కరోనా వైరస్ సోకి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ కాలనీలోని 800 మంది కార్మికులను పోలీసులు హోం క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామ పరిధిలోని కన్హా శాంతివనం అనే కాలనీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కన్హా శాంతివనంలో వందలాది మంది కార్మికులు పనులు చేస్తున్నారు. వీరిలో ఓ మహిళకు కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ శాంతివనంను సందర్శించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా శాంతివనంలో పని చేసే 800 మంది కార్మికులను హోంక్వారంటైన్‌కు తరలించాలని ఆదేశించారు. 
 
కలెక్టర్ ఆదేశాల మేరకు చేగూరు గ్రామ సరిహద్దులో చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. గ్రామంలోకి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. గ్రామంలో ఇంకెవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా అని తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments