Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తబ్లీగి వర్కర్ల ద్వారానే వేలాది మందికి వైరస్ సోకింది : కేంద్రం

తబ్లీగి వర్కర్ల ద్వారానే వేలాది మందికి వైరస్ సోకింది : కేంద్రం
, ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (10:30 IST)
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మత సమ్మేళనానికి హాజరైన తబ్లీగి వర్కర్లు విదేశీ ప్రతినిధుల నుంచి కరోనా అంటించుకున్నారనీ, వీరిద్వారా ఏకంగా 20వేల మందిలో ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో వారందరినీ పట్టుకుని కరోనా పరీక్షలు చేస్తున్నట్టు పేర్కొంది. 
 
ఇప్పటివరకు పట్టుకున్న వారికి కరోనా పరీక్షలు చేస్తున్నామని, వారిలో ఇప్పటివరకు 1023 మందికి పాజిటివ్‌ వచ్చినట్లుగా ఆరోగ్య శాఖ తెలిపింది. వీరంతా 17 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నట్లు చెప్పింది. మొత్తం పాజిటివ్‌ కేసులు 2902 కాగా, అందులో తబ్లీగీ జమాత్‌ వాటాయే 30 శాతంగా ఉందని తెలిపింది. 
 
ఇకపోతే, రాజస్థాన్‌ రాష్ట్రంలో 5 జిల్లాల్లో 5 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ ఐదుగురూ ఢిల్లీకి వచ్చిన వారేనని పేర్కొంది. అలాగే, యూపీలోని ముజఫర్‌నగర్‌లో పోలీసులపై దాడికి ఉసిగొల్పిన వ్యక్తి జాడ చెప్పిన వారికి రూ.25 వేలు ఇస్తామని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కువైట్‌లోని భారతీయుల్లో వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. కారణమిదే...