Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కోలుకున్నాడు.. ఆరేళ్ల బాలుడు డిశ్చార్జి..

Corona
Webdunia
సోమవారం, 4 మే 2020 (22:12 IST)
హైదరాబాదులోని గాంధీ దవాఖానా నుంచి ఆరేళ్ల బాలుడు కరోనా రక్కసి చెర నుంచి బయటపడ్డాడు. సోమవారం అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఢిల్లీ మర్కజ్‌ నుంచి వచ్చిన ఒకరి ద్వారా జైనూర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా సోకగా, తన నుంచి తన ఆరేళ్ల మనుమడికి అంటుకుంది. 
 
గత నెల 18న పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రావడంతో హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. బాలుడు కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో మగ్గురు కోలుకున్నారు. మరో నలుగురు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
 
ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. సోమవారం కేవలం కొత్తగా 3 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1085కు చేరింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
సోమవారం నమోదైన మూడు కేసులు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. ఇంకా సోమవారం పూట 40మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఫలితంగా మొత్తం 585 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments