Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మూడో వేవ్ పిల్లలపై ప్రభావం చూపనుంది, అన్ని విధాలా సిద్ధంగా ఉందాం: ఎంపీ రేవంత్ రెడ్డి

Webdunia
మంగళవారం, 18 మే 2021 (18:57 IST)
కరోనా మూడో వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ విషయంలో హెచ్చరిస్తున్నారని, ఇప్పటి నుంచే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 
 
మంగళవారం నాడు ఈ విషయమై ఆయన ఒక ట్వీట్ చేశారు. దేశంలో మూడో కరోనో వేవ్ విషయంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశంలో పిల్లల తల్లి తండ్రులకు వెంటనే కరోనో వాక్సిన్స్ టీకాలు వేయించాలని, పిల్లల వ్యాధులకు సంబంధించిన మందుల ఉత్పత్తులను గణనీయంగా పెంచి అన్ని రకాల మందుల కొరత లేకుండా చూడాలని ఆయన సూచించారు. 
 
అలాగే దేశంలో వైద్య సిబ్బందిని సరిపోయేంతగా పెంచాలని, నర్సింగ్ సిబ్బందిని పెంచి వారికి సరైన శిక్షణ, నైపుణ్యం ఇవ్వాలని ఇది ఈ సమయంలో అత్యంత కీలకమైన విషయమని అన్నారు. 
 
మూడో వేవ్ పిల్లల మీద ప్రభావం చూపుతుందని భయాందోళన ఉన్న నేపత్యంలో అన్ని రకాలుగా మనం సిద్ధంగా ఉండాలని, మన భవిష్యత్ తరాలను రక్షించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments