Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడెంలోకి రానివ్వలేదనీ చెరువులో దూకిన విద్యార్థిని.. తర్వాత..

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (10:32 IST)
కరోనా వైరస్ సోకలేదనీ వైద్యులు నిర్ధారించినప్పటికీ.. గ్రామస్థులు మాత్రం గ్రామంలోకి అడుగుపెట్టనీయలేదు. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్థాపానికిలోనై చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా పెద్దగోళ్ళగూడెంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్దగోళ్ళగూడెంకు చెందిన ఓ యువతి మహారాష్ట్రలో అగ్రికల్చర్ విభాగంలో విద్యాభ్యాసం చేస్తోంది. ఈమె నానా తంటాలుపడి కొత్తగూడెంకు చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు ఆ యువతి వద్దకు చేరుకుని, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 
 
ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా నెగెటివ్ అని తేలింది. అయినప్పటికీ అధికారులు మాత్రం హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆ యువతిని ఆదేశించారు. అయితే, గూడెంవాసులు మాత్రం ఆ యువతిని గ్రామంలోకి అడుగుపెట్టనీయలేదు. 
 
దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన ఆ యువతి... చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆ యువతిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments