గూడెంలోకి రానివ్వలేదనీ చెరువులో దూకిన విద్యార్థిని.. తర్వాత..

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (10:32 IST)
కరోనా వైరస్ సోకలేదనీ వైద్యులు నిర్ధారించినప్పటికీ.. గ్రామస్థులు మాత్రం గ్రామంలోకి అడుగుపెట్టనీయలేదు. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్థాపానికిలోనై చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా పెద్దగోళ్ళగూడెంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్దగోళ్ళగూడెంకు చెందిన ఓ యువతి మహారాష్ట్రలో అగ్రికల్చర్ విభాగంలో విద్యాభ్యాసం చేస్తోంది. ఈమె నానా తంటాలుపడి కొత్తగూడెంకు చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు ఆ యువతి వద్దకు చేరుకుని, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 
 
ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా నెగెటివ్ అని తేలింది. అయినప్పటికీ అధికారులు మాత్రం హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆ యువతిని ఆదేశించారు. అయితే, గూడెంవాసులు మాత్రం ఆ యువతిని గ్రామంలోకి అడుగుపెట్టనీయలేదు. 
 
దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన ఆ యువతి... చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆ యువతిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments