కరోనా ఎఫెక్ట్... ఆ గ్రామంలోకి తల్లికైనా నో ఎంట్రీ

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (13:52 IST)
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్న ఓ గ్రామ సర్పంచ్‌ పంచాయతీ నిర్ణయానికి కట్టుబడి సొంత తల్లికే ప్రవేశం నిరాకరించాడు.

బంధువుల ఇంటి నుంచి వచ్చిన తల్లిని తిప్పి పంపించేశాడు. ఈ సంఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండల పరిధిలోని గోసాయిపల్లిలో జరిగింది.

సిర్గాపూర్‌ మండల కేంద్రంలో మూడు కుటుంబాలను క్వారంటేయిన్‌లో ఉంచడంతో అప్రమత్తమైన గోసాయిపల్లి వాసులు గ్రామ శివారులో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి బయటి నుంచి ఎవరూ రాకుండా కట్టడి చేశారు.

సిర్గాపూర్‌లో బంధువుల దగ్గర ఉన్న సర్పంచ్‌ సాయాగౌడ్‌ తల్లి సోమవారం స్వగ్రామానికి రాగా చెక్‌పోస్టు వద్ధ వీఆర్‌ఏలు ఆమెను నిలిపివేసి సర్పంచ్‌కు సమాచారమిచ్చారు.

ఇతర గ్రామాల నుంచి ఎవరినీ రానీయొద్దనే గ్రామస్థుల నిర్ణయాన్ని గౌరవించిన సర్పంచ్‌ తన తల్లికైనా అదే కట్టడి వర్తిస్తుందని తెలిపాడు. దీంతో సర్పంచ్‌ తల్లి తిరిగి వెళ్లిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments