Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్... ఆ గ్రామంలోకి తల్లికైనా నో ఎంట్రీ

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (13:52 IST)
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్న ఓ గ్రామ సర్పంచ్‌ పంచాయతీ నిర్ణయానికి కట్టుబడి సొంత తల్లికే ప్రవేశం నిరాకరించాడు.

బంధువుల ఇంటి నుంచి వచ్చిన తల్లిని తిప్పి పంపించేశాడు. ఈ సంఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండల పరిధిలోని గోసాయిపల్లిలో జరిగింది.

సిర్గాపూర్‌ మండల కేంద్రంలో మూడు కుటుంబాలను క్వారంటేయిన్‌లో ఉంచడంతో అప్రమత్తమైన గోసాయిపల్లి వాసులు గ్రామ శివారులో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి బయటి నుంచి ఎవరూ రాకుండా కట్టడి చేశారు.

సిర్గాపూర్‌లో బంధువుల దగ్గర ఉన్న సర్పంచ్‌ సాయాగౌడ్‌ తల్లి సోమవారం స్వగ్రామానికి రాగా చెక్‌పోస్టు వద్ధ వీఆర్‌ఏలు ఆమెను నిలిపివేసి సర్పంచ్‌కు సమాచారమిచ్చారు.

ఇతర గ్రామాల నుంచి ఎవరినీ రానీయొద్దనే గ్రామస్థుల నిర్ణయాన్ని గౌరవించిన సర్పంచ్‌ తన తల్లికైనా అదే కట్టడి వర్తిస్తుందని తెలిపాడు. దీంతో సర్పంచ్‌ తల్లి తిరిగి వెళ్లిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments