Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రామాల్లో 'బెల్టు' తీయాల్సిందే: సీఎం

గ్రామాల్లో 'బెల్టు' తీయాల్సిందే: సీఎం
, శుక్రవారం, 6 మార్చి 2020 (06:19 IST)
ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాల్లో బెల్టు షాపులు ఉండకూడదని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం మహిళా పోలీసులను వినియోగించుకోవాలని సూచించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎన్​ఫోర్స్​మెంట్, ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఎక్కడా ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ తయారీ ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.

ఎన్​ఫోర్స్​మెంట్, ప్రొహిబిషన్, ఎక్సైజ్​శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి, సీఎస్ నీలం సాహ్ని పాల్గొన్నారు. గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్టుషాపులు నడవకూడదని సీఎం నిర్దేశించారు. ఎలాంటి సందర్బంలోనూ ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరగకూడదన్నారు.

ఈ విషయంలో పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళా శక్తిని వినియోగించండి గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్ఠ పెరగాలంటే బెల్టుషాపులు ఉండకూడదని సీఎం ఉద్ఘాటించారు.

గ్రామాల్లో 11 వేలకుపైగా మహిళా పోలీసులు ఉన్నారని.. వీరి సహకారంతో అక్రమ మద్యం అరికట్టాలని సూచించారు. బెల్టుషాపుల నిరోధం మహిళా పోలీసుల ప్రాథమిక విధి అని చెప్పారు.

ఎన్‌ఫోర్స్​మెంట్‌ విభాగంలో సిబ్బందిని పెంచాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖలో ఉన్న మూడింట రెండు వంతుల సిబ్బందిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పనుల కోసం వినియోగించాలన్నారు.

స్టాండర్ట్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను తయారుచేసుకోవడం ద్వారా విధి నిర్వహణలో సమర్థతను పెంచుకుని అనుకున్న లక్ష్యాలను సాధించాలని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో.. ఒకే ఇంట్లో 66 పాము పిల్లలు