Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్‌ఎస్‌ వారి ఇళ్లల్లో ఎందుకు సోదాలు చేయించడం లేదు?: కాంగ్రెస్‌

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (08:27 IST)
దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, ఇతర పార్టీల నాయకుల ఇళ్లలో ఐటీ దాడులు చేయిస్తున్న బీజేపీ.. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన వారి ఇళ్లల్లో ఎందుకు సోదాలు చేయించడం లేదని టీపీసీసీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ ఒక్కటేనని  అన్నారు. ఆ రెండు పార్టీలు ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ.. అన్న విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. 
 
మద్యం, గంజాయి, డ్రగ్స్‌, బెల్టు షాపుల వల్ల నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లాలో ఇటీవల హత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు.

మహిళ చిత్ర పటం వద్ద నివాళులర్పించి, బాధిత కుటుంబానికి రూ.లక్ష చెక్కును అందజేశారు. ఈ సందర్భంగానే మీడియాతో మాట్లాడారు. మహిళపై దారుణానికి పాల్పడిన వారికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. 

రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలపై ఆడిట్‌ నిర్వహించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ సీఎం కేసీఆర్‌ను కోరారు. మరణాలకు నిర్దిష్ట కారణాలను చూపుతూ ధ్రువీకరణ పత్రాలనూ జారీ చేయాలన్నారు. కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం ఇచ్చే రూ.50 వేల సాయం పొందడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments