Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ అధిష్టానానికి మాజీ ఎమ్మెల్సీ అల్టిమేటం...

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (15:21 IST)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో సీనియర్ నేత తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిత్తుగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేతమాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు కాంగ్రెస్ హైకమాండ్‌కు అల్టిమేటం జారీచేశారు. ఈయన పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. 
 
ఉత్తర తెలంగాణ ఇందిరా కాంగ్రెస్‌ పేరుతో పార్టీ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం ఆయన అనుచరులతో సమావేశమవుతున్నారు. ఈ సమావేశం తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన నేతలతోనే కాంగ్రెస్‌ వీడుతున్నట్లు ఆయన చెబుతున్నారు.
 
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులతో మంచిర్యాలలో తన నివాసంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు, పార్టీనే నమ్ముకున్న నాయకులకు అన్యాయం జరుగుతోందని ప్రేంసాగర్ రావు మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలు, నాయకులను వదిలేసి కొత్తగా వచ్చిన వారికి పార్టీ పగ్గాలు ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments