Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సులోనే ఉరేసుకున్న కండక్టర్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (11:46 IST)
ఓ కండక్టర్ ఆర్టీసీ బస్సులోనే ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన పాలమూరు జిల్లా తొర్రూరు బస్సు డిపోలో జరిగింది. ఈ మండలంలోని కంఠాయపాళెం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి తెలంగాణ ఆర్టీసీ బస్సు కండక్టరుగా తొర్రూరు డిపోలో పని చేస్తున్నారు. ఈయన ఆదివారం ఎప్పటిలానే విధులకు హాజరయ్యారు. ఆయన హాజరుపట్టీలో సంతకం చేసి డిపో లోపలికి వెళ్లారు. అయితే, లోపలకు వెళ్లిన మహేందర్ రెడ్డి ఎంతకీ బయటకురాకపోవడంతో అనుమానించిన సెక్యూరిటీ గార్డు డిపో అంతా గాలించారు. 
 
ఈ క్రమంలో ఆయన ఓ బస్సులో ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. దీంతో డిపో అధికారులకు సమాచారం అందించారు. డిపో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. డిపోకు వచ్చి మహేందర్ రెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, మహేందర్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆత్మహత్యకు కుటుంబ సమస్యలా? ఆర్థిక కష్టాలా? పని ఒత్తిడా? పై అధికారుల వేధింపులా? అనే విషయం తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments