ఆర్టీసీ బస్సులోనే ఉరేసుకున్న కండక్టర్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (11:46 IST)
ఓ కండక్టర్ ఆర్టీసీ బస్సులోనే ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన పాలమూరు జిల్లా తొర్రూరు బస్సు డిపోలో జరిగింది. ఈ మండలంలోని కంఠాయపాళెం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి తెలంగాణ ఆర్టీసీ బస్సు కండక్టరుగా తొర్రూరు డిపోలో పని చేస్తున్నారు. ఈయన ఆదివారం ఎప్పటిలానే విధులకు హాజరయ్యారు. ఆయన హాజరుపట్టీలో సంతకం చేసి డిపో లోపలికి వెళ్లారు. అయితే, లోపలకు వెళ్లిన మహేందర్ రెడ్డి ఎంతకీ బయటకురాకపోవడంతో అనుమానించిన సెక్యూరిటీ గార్డు డిపో అంతా గాలించారు. 
 
ఈ క్రమంలో ఆయన ఓ బస్సులో ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. దీంతో డిపో అధికారులకు సమాచారం అందించారు. డిపో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. డిపోకు వచ్చి మహేందర్ రెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, మహేందర్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆత్మహత్యకు కుటుంబ సమస్యలా? ఆర్థిక కష్టాలా? పని ఒత్తిడా? పై అధికారుల వేధింపులా? అనే విషయం తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments