Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాయ్‌లాండ్‌లో వాయు కాలుష్యం.. 13 లక్షల మంది అనారోగ్యం

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (11:27 IST)
థాయ్‌లాండ్‌లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు సుమారు 13 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారు. గడిచిన వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 2లక్షల మంది ఆస్పత్రులలో చేరారని అధికారులు తెలిపారు. 
 
బ్యాంకాక్ సిటీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయిందని హెచ్చరించారు. సిటీని కాలుష్యం కమ్మేసిందని, వాహనాలు, ఫ్యాక్టరీలు వెలువరించే కాలుష్యంతో పాటు వ్యవసాయ వ్యర్థాల కాల్చివేత వల్ల ఎయిర్ క్వాలిటీ పడిపోతుందని తెలిపారు. గాలి నాణ్యత మెరుగుపడే వరకు అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దునని అధికారులు ప్రజలకు సూచించారు. 
 
ఉద్యోగులు ఇంట్లో నుంచే పనిచేయాలని.. పిల్లలు, గర్భిణీలు ఇంటికే పరిమితం కావాలని థాయ్ లాండ్ మంత్రి క్రియాంగ్ క్రాయ్ పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే మంచి నాణ్యతకల ఎన్-95 మాస్క్ ను తప్పకుండా ధరించాలని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments