Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చుకున్న వైద్యుడు.. ఎక్కడ?

gunshot
, సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (20:42 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వైద్యుడు తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చుకోవడంతో డాక్టర్ మజారుద్దీన్ చనిపోయాడు. ఆయనను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, డాక్టర్ మజారుద్దీన్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.7లో నివసిస్తున్నారు. ఆయన పాయింట్ బ్లాంక్ రేంజిలో తుపాకీతో కాల్చుకున్నారు. తీవ్రంగా గాయపడిన డాక్టర్ మజారుద్దీన్‌ను కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
 
పోస్టుమార్టం నిమిత్తం డాక్టర్ మజారుద్దీన్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబంలో గొడవల వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. కాగా, డాక్టర్ మజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు వియ్యంకుడు కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఈశాన్య' అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీదే హవా