Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే - ముంపు బాధితులకు రూ.10 వేలు

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (15:27 IST)
భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలతో తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ వరద ముంపు అధికంగా ఉంది. ఈ క్రమంలో ఈ వరద బాధిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఆదివారం ఏరియల్ సర్వే చేశారు. 
 
భద్రాచలం నుంచి ఏటూరునాగారం దిశగా హెలికాప్టర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను వీక్షించారు. ప్రకృతి విపత్తుతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, ఇరువైపులా జలమయమైన ప్రాంతాలు, నీటిలో చిక్కుకున్న గ్రామాల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదికి సీఎం శాంతి పూజలు చేశారు. భద్రాచలం వంతెనపై నుంచి గోదావరి పరిసరాలను పరిశీలించారు. గోదావరి కరకట్టను కూడా సీఎం వీక్షించారు.
 
ఈ సందర్బంగా భద్రాచలంలో వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తామని ప్రకటించారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు చేపడుతామన్నారు. అదే విధంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో రూ.వెయ్యి కోట్లతో కొత్త కాలనీని నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 
 
ఇప్పటివరక మొత్తం 7274 కుటుంబాలను జిల్లా యంత్రాంగం పునరావస కేంద్రాలకు తరలించిందన్నారు. బాధిత కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని, ప్రతి కుటుంబానికి 20 కేజీల చొప్పున బియ్యం ఇస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments