Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ పర్యటన: బీజేపీని సాగనంపాలని పిలుపు

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (19:58 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కొంగరకలాన్ లోని జిల్లా సమీకృత కలక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌కు సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 
 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వాన్ని సాగ‌నంపాల‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అప్పుడే ఈ దేశం, తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. జాతీయ రాజ‌కీయాల్లో పిడికిలి ఎత్తాలి. మన రాష్ట్రం కూడా బంగారు తెలంగాణగా త‌యార‌వుతుంది. ఆ మ‌హాయ‌జ్ఞంలో తెలంగాణ భాగ‌స్వామ్యం కావాలి. ప్రజస అనుమ‌తితో ఆ ప‌నికి తాను జెండా ఎత్తుతానని కేసీఆర్ పేర్కొన్నారు. 
 
ఇంకా సీఎం మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా తెలంగాణ‌కే బంగారు కొండ‌గా మారింద‌ని పేర్కొన్నారు. ఎక‌రం భూమి ఉన్న వ్య‌క్తి కూడా పెద్ద కోటీశ్వ‌రుడు. ఈ మ‌త పిచ్చిల ప‌డి దాన్ని చెడ‌గొట్టుకోవాలా. నీచ రాజ‌కీయాల కోసం రాష్ట్రాన్ని అల్ల‌క‌ల్లోలం చేస్తుంటే చూసి ఊరుకోవ‌ద్దు. 
 
తెలంగాణ స‌మాజం ప్ర‌శాంతంగా ఉంది. అద్భుత‌మైన‌టువంటి ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో అభివృద్ధి జ‌రుగుతుంది. ఈ దుర్మార్గులు, చిల్ల‌ర‌గాళ్లు, మ‌త పిచ్చిగాళ్ల మాయ‌లో ప‌డొద్ద‌ని కేసీఆర్ సూచించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments