"క్లౌడ్ బరస్ట్" - ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ : బండి సంజయ్

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (18:59 IST)
తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వెనుక అతిపెద్ద కుట్ర ఉందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ శతాబ్దపు అతిపెద్ద కుట్రగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆదివారం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటిస్తే బాధితులకు భరోసా కలగడంతో పాటు, ఆదుకుంటారనే నమ్మకం ఏర్పడాలన్నారు. కానీ, సీఎం అక్కడికి వెళ్లి చేసిన కామెంట్లు జోకర్‌ను తలపిస్తున్నాయని దుయ్యబట్టారు. 
 
గతంలో గోదావరికి వరదలు గతంలో ఎన్నోసార్లు వచ్చాయని, ఈసారీ వచ్చాయని, భవిష్యత్తులో రావని కూడా చెప్పలేమన్నారు. కానీ, కేసీఆర్‌ మాత్రం భారీ వర్షాలు మానవ సృష్టిలా కన్పిస్తోందని, పైగా విదేశాల కుట్ర అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్‌ పడరాని పాట్లు పడుతున్నారని, విదేశీ కుట్ర పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. కుట్రలకే అతిపెద్ద కుట్రదారుడు కేసీఆర్‌ అని విమర్శించారు. 
 
మిషన్ కాకతీయ పేరుతో పూడిక తీయడమే తప్ప కట్టల నిర్మాణాన్ని విస్మరించడంతో అనేకచోట్ల చెరువులు, కుంటలు తెగి వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. భారీ వర్షాలకు ఇళ్లు కోల్పోయి పూర్తిగా నిరాశ్రయులైన వేలాది మంది ముంపు బాధితులను ఏ విధంగా ఆదుకుంటారో సీఎం చెప్పాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments