Webdunia - Bharat's app for daily news and videos

Install App

షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు.. పాతవారికే టిక్కెట్లు : సీఎం కేసీఆర్

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (19:15 IST)
తెరాస విస్తృత స్థాయి సమావేశం మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని తెరాస భవన్‌లో జరిగింది. ఇందులో సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. వచ్చే ఎన్నికలు పాతవారికే టిక్కెట్లు ఇస్తామని తెలిపారు. అయితే, విజయం కోసం ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. అదేసమయంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్పారు. 
 
ఈ సందర్భంగా బీజేపీ చేస్తున్న రాజకీయాలను నిలువరించేందుకు గట్టిగానే ప్రయత్నం చేయాలని కోరారు. ముఖ్యంగా, తెరాసను బీజేపీ తీవ్ర ఇబ్బందులు పెడుతుందన్నారు. అందువల్ల బీజేపీ నేతలు ఒక మాట అంటే మనం పది మాటలు అనేలా పార్టీ నేతలు ఉండాలని పిలుపునిచ్చారు. అదేసమయంలో వివాదాలకు దూరంగా ఉండాలని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొవద్దని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 
 
పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా తన కుమార్తెనే పార్టీ మారాలంటూ బీజేపీ నేతలు అడిగారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, బీజేపీ, వైకాపా బంధాన్ని కూడా సీఎం కేసీఆర్ స్పందించారు. బీజేపీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంచి స్నేహ సంబంధాలే ఉన్నాయని అన్నారు. 
 
ఒకవైపు తమకు అనుకూలంగా ఉన్న జగన్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments