Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ములాయంకు నివాళులు అర్పించేందుకు నేడు లక్నోకు సీఎం కేసీఆర్

mulayam singh yadav
, మంగళవారం, 11 అక్టోబరు 2022 (10:00 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం అనారోగ్యం కారణంగా మృతి చెందిన ఎస్పీ మాజీ అధ్యక్షుడు, రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. 
 
హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లి అక్కడ నుంచి ములాయం స్వగ్రామం సైఫాయికి వెళుతారు. ములాయం అంతిమ సంస్కార కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకుని అక్కడే రెండు రోజుల పాటు హస్తినలో ఉంటారు. 
 
కాగా, ఇటీవల తమ పార్టీ తెరాసను భారసగా మార్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రెండు మూడు రోజులు పాటు మకాం వేసి పలువురు బ్యూరోక్రాట్స్‌తో పాటు రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ఇతర పార్టీల ప్రముఖులతో సమావేశమవుతారు. మూడు రోజుల పాటు ఆయన హైదరాబాద్ నగరానికి తిరిగివస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో బంగారం - వెండి ధరలు ఎలా ఉన్నాయి?