Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీలో బస్సు, మినీ ట్రక్కు ఢీ: పది మంది మృతి.. 41 మందికి గాయాలు

road accident
, గురువారం, 29 సెప్టెంబరు 2022 (14:09 IST)
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోగా.. 41మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాతీయ రహదారి 730పై గల ఐరా వంతెనపై జరిగిందని డీఎస్పీ ప్రీతమ్ పాల్ సింగ్ తెలిపారు. 
 
గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని, వారిని లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించామని, 29 మంది జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని లఖింపూర్ ఖేరీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. బస్సు ధౌర్హరా నుంచి లక్నో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మినీ ట్రక్కును ఢీకొట్టింది. 
 
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి రూ. 2లక్షలను మృతుల యెుక్క ప్రతి కుటుంబానికి, రూ.50,000 గాయపడిన వారికి అందజేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాటా మోటార్స్ నుంచి Tata Tiago EV : ఫీచర్స్ ఇవే..