బోరు బావిలో పడిన చిన్నారి మృతి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 28 మే 2020 (08:10 IST)
మెదక్‌ జిల్లాలో బోరు బావిలో పడ్డ చిన్నారి సాయివర్ధన్‌ మృతిచెందాడు. దాదాపు 17 అడుగుల లోతులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. రెస్క్యూ సిబ్బంది బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వారు.

అయితే అప్పటికే చిన్నారి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం బోరు వేసిన అరగంటకే మూడేళ్ల చిన్నారి సాయివర్ధన్‌ బోరుబావిలో పడ్డాడు. పాపన్న పేట మండలంలో సాగుకోసం పంటపొలంలో బోరు వేశారు. అయితే వెంటనే కేసింగ్‌ ఏర్పాటు చేయలేదు.

దీంతో ఆటలాడుకుంటున్న మూడేళ్లచిన్నారి సాయి వర్ధన్‌ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

బాలుడిని వీలైనంత త్వరగా బావి నుండి బయటకు తీసేందుకు యత్నించారు. దాదాపు 12 గంటలపాటు రెస్క్యూ నిర్వహించి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు.

మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరు మన్నీరు అయ్యారు. ఆ గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. స్థానికులందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తరుణ్ భాస్కర్.. గాయపడ్డ సింహం నుంచి సెటైరికల్ రాప్ సాంగ్

Santosh Krishnan: విలేజ్ బ్యాక్ డ్రాప్ తో R చిత్రం ప్రారంభం

Devakonda: హృదయాలను తాకుతున్న ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ గీతం సంచారమే

Manchu Laxmi: లేచింది మహిళాలోకం మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు, నవ్వించే చిత్రం: మంచు లక్ష్మి

Raviteja: డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కడుపులో మంటగా ఉందా?

షార్లెట్‌లో నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు

కుండనీరు తాగితే ఏంటి లాభం.. తెలుసుకుందామా?

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments