Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఎమ్మెల్సీ కవిత వద్ద సీబీఐ విచారణ ప్రారంభం

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (13:06 IST)
ఢిల్లీ మద్యం స్కామ్‌లో భారత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కె.కవిత పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆమె వద్ద సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందుకోసం సీబీఐ అధికారుల బృందం ఆదివారం ఉదయం హైదరాబాద్ నగరంలోని కవిత నివాసానికి చేరుకున్నారు. 
 
కాగా, ఈ కేసులో కవిత వద్ద విచారణకోసం ఆరో తేదీని సూచిస్తూ సీబీఐ ఓ లేఖను రాసింది. ఆ రోజున తనకు ఇతర కార్యక్రమాలు ఉన్నందున 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని తెలుపుతూ ప్రత్యుత్తరం రాశారు. దీంతో సీబీఐ అధికారులు ఆదివారం విచారిస్తామని సమాచారం ఇవ్వగా, అందుకు కవిత అంగీకరించారు. ఈ క్రమంలో సీబీఐ అధికారుల బృందం ఆదివారం ఆమె నివాసానికి చేరుకున్నారు. 
 
మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కాములో తన పేరు ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన దరిమిలా ఆమె న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నట్టు సమాచారం. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ తన ఇంటి వద్దకు రావొద్దని కోరారు. సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత ఇంటికి వెళ్లే మార్గంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments