తెలంగాణాలో తెరాస సర్పంచ్ కారును తగలబెట్టిన దుండగులు

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (12:18 IST)
తెలంగాణ రాష్ట్రంలో తెరాస సర్పంచ్ కారును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఈసన్నపల్లిలో ఈ ఘటన జరిగింది.
 
స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు తెరాస సర్పంచ్ కందూరు బాలమణికి చెందిన కారును తన ఇంటి బయట పార్క్ చేసి వుండగా, శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారుకు నిప్పంటించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్.ఐ. అనిల్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రాజకీయ కక్షతోనే, ఉద్దేశపూర్వకంగా తన కారును ఎవరో నిప్పు అంటించారని సర్పంచ్ బాలమణి వాపోతున్నారు. 
 
కాగా, కొద్దిరోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మిర్‌‍దొడ్డి మండలం అక్బర్ పేటలో తెరాస సర్పంచ్ స్వరూపకు చెందిన కారు, ట్రాక్టర్‌కు దుండగులు నిప్పు పెట్టిన విషయం తెల్సిందే. ఇంటి ముందు నిలిపివున్న ఈ వాహనాలకు  ఇదే విధంగా నిప్పుపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments