Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు డోర్స్ లాక్... ఊపిరాడక ప్రాణం విడిచిన ఇద్దరు చిన్నారులు

Webdunia
బుధవారం, 24 జులై 2019 (19:24 IST)
నిజామాబాద్ ముజాహిద్ నగర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు కారులో ఎక్కి ఊపిరాడక చనిపోయారు. రియాజ్‌ (10), మొహమ్మద్‌ బద్రుద్దీన్‌ (5) ఇద్దరూ అక్కాచెల్లెళ్ల పిల్లలు. ఈ పిల్లలు మంగళవారం మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి కాలనీలో పార్క్‌ చేసి ఉన్న కారు వెనుక సీట్లో ఎక్కి కూర్చున్నారు. 
 
అప్పటికే కారు అద్దాలు మూసి ఉండటంతో ఒక్కసారిగా కారు డోర్లు లాక్‌ అయ్యాయి. దీంతో ఇద్దరూ ప్రాణాలు విడిచారు. పిల్లల జాడ తెలియకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి  తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతకినా లాభం లేకపోయింది. 
 
ఇంతలో కారు యజమాని ఇద్దరు చిన్నారులు మృతదేహాలను కారులో గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. అయితే చిన్నారుల తల్లిదండ్రులు మాత్రం డోర్ లాక్ చేసి ఉన్న కారులోకి పిల్లలు ఎలా వెళ్లి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments