Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు డోర్స్ లాక్... ఊపిరాడక ప్రాణం విడిచిన ఇద్దరు చిన్నారులు

Webdunia
బుధవారం, 24 జులై 2019 (19:24 IST)
నిజామాబాద్ ముజాహిద్ నగర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు కారులో ఎక్కి ఊపిరాడక చనిపోయారు. రియాజ్‌ (10), మొహమ్మద్‌ బద్రుద్దీన్‌ (5) ఇద్దరూ అక్కాచెల్లెళ్ల పిల్లలు. ఈ పిల్లలు మంగళవారం మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి కాలనీలో పార్క్‌ చేసి ఉన్న కారు వెనుక సీట్లో ఎక్కి కూర్చున్నారు. 
 
అప్పటికే కారు అద్దాలు మూసి ఉండటంతో ఒక్కసారిగా కారు డోర్లు లాక్‌ అయ్యాయి. దీంతో ఇద్దరూ ప్రాణాలు విడిచారు. పిల్లల జాడ తెలియకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి  తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతకినా లాభం లేకపోయింది. 
 
ఇంతలో కారు యజమాని ఇద్దరు చిన్నారులు మృతదేహాలను కారులో గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. అయితే చిన్నారుల తల్లిదండ్రులు మాత్రం డోర్ లాక్ చేసి ఉన్న కారులోకి పిల్లలు ఎలా వెళ్లి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments