Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ పార్టీ మేనిఫెస్టో.. చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందేనా...?

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2023 (12:12 IST)
వచ్చే నెలాఖరులో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుంది. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలన్న పట్టులతో అధికార భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ ఉన్నారు. దీంతో ఆయన ప్రతి ఒక్కరి మైండ్ బ్లాక్ అయ్యే మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. నిరుపేద మహిళలకు నెలకు రూ.3 వేలు ఇవ్వనున్నట్టు సమాచారం. రానున్న ఎన్నికల్లోనూ విజయం సాధించాలని, హ్యాట్రిక్ సీఎంగా పేరు సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ మ్యానిఫెస్టోను పకడ్బందీగా తయారుచేసినట్టు సమాచారం.
 
బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. ప్రస్తుతం అమల్లో ఉన్న రైతుబీమా పరిహారం రూ.5 లక్షలను రాష్ట్రంలోని 90 లక్షల పేద కుటుంబాలకు వర్తింపజేయనున్నారు. నిరుపేద మహిళలకు జీవనభృతిగా ప్రతినెల రూ.3000 అందిస్తారు. ఇప్పటికే పెన్షన్ అందుతున్న మహిళలను ఇందులోంచి మినహాయిస్తారు. 
 
అలాగే, ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర వారికి ప్రస్తుతం అందిస్తున్న రూ.2,016 పింఛన్ ను రూ. 3,016కు పెంచుతారు. జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్ పథకం, రైతుబంధు సాయం రూ.16 వేలకు పెంపు, ప్రతి సీజన్లో ఉచితంగా ఎకరానికి రెండు బస్తాల యూరియా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఇస్తున్న ఆర్థికసాయం రూ.1.25 లక్షలకు పెంచనున్నారు. 
 
అలాగే, వంట గ్యాస్ సిలిండర్లపై రూ.400 వరకు సబ్సిడీ, మహిళలకు రూ. 2 లక్షల మేర వడ్డీలేని రుణాలు, ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితి రూ.10 లక్షలకు పెంపు, పెంట్రోలు, డీజిల్ ధరలపై రాష్ట్ర పన్ను వాటా కొంత మేర తగ్గింపు వంటివి ఉన్నాయి. అయితే, ఈ మేనిఫెస్టోను అధికారికంగా ఆదివారం వెల్లడించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments