Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిచంద్ కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం అందించిన బీఆర్ఎస్

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (14:01 IST)
గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్న సాయిచంద్ అతి చిన్న వయసులోనే ఇటీవల కన్నుమూశారు. దీంతో ఆయన భార్య రజనీతో పాటు కుటుంబ సభ్యులు తీవ్రమైన బాధలో కూరుకునిపోయారు. ఆ కుటుంబాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలు ఆదుకుంటున్నారు. ఇందులోభాగంగా, సాయిచంద్ భార్యకు బీఆర్ఎస్ పార్టీ కోటి రూపాయల ఆర్థికసాయాన్ని అందించింది. ఈ చెక్కును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ అనితా రెడ్డి, తెరాస నేత దాసోజు శ్రవణ్‌లు సాయిచంద్ ఇంటికి వెళ్ళి సాయిచంద్ భార్య రజనీకి అందించారు. అలాగే, సాయిచంద్ తల్లిదండ్రులు, సోదరికి కూడా మరో రూ.50 లక్షల చెక్కును ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో సాయిచంద్ తన పాటలతో తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచారని కొనియాడారు. ఆయన అకాల మరణం తీరని లోటని అన్నారు. భర్తను కోల్పోయిన రజనీ బాధ ఎలా ఉంటుందో తనకు తెలసన్నారు. సాయిచంద్ కుటుంబానికి అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. కాగా, సాయిచంద్ మరణంతో ఆయన భార్య రజనీని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments