Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిచంద్ కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం అందించిన బీఆర్ఎస్

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (14:01 IST)
గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్న సాయిచంద్ అతి చిన్న వయసులోనే ఇటీవల కన్నుమూశారు. దీంతో ఆయన భార్య రజనీతో పాటు కుటుంబ సభ్యులు తీవ్రమైన బాధలో కూరుకునిపోయారు. ఆ కుటుంబాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలు ఆదుకుంటున్నారు. ఇందులోభాగంగా, సాయిచంద్ భార్యకు బీఆర్ఎస్ పార్టీ కోటి రూపాయల ఆర్థికసాయాన్ని అందించింది. ఈ చెక్కును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ అనితా రెడ్డి, తెరాస నేత దాసోజు శ్రవణ్‌లు సాయిచంద్ ఇంటికి వెళ్ళి సాయిచంద్ భార్య రజనీకి అందించారు. అలాగే, సాయిచంద్ తల్లిదండ్రులు, సోదరికి కూడా మరో రూ.50 లక్షల చెక్కును ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో సాయిచంద్ తన పాటలతో తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచారని కొనియాడారు. ఆయన అకాల మరణం తీరని లోటని అన్నారు. భర్తను కోల్పోయిన రజనీ బాధ ఎలా ఉంటుందో తనకు తెలసన్నారు. సాయిచంద్ కుటుంబానికి అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. కాగా, సాయిచంద్ మరణంతో ఆయన భార్య రజనీని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments