Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉద్యోగం చేయొద్దని భార్య అరచేయి నరికేసిన భర్త.. ఎక్కడ?

knife
, ఆదివారం, 27 ఆగస్టు 2023 (10:40 IST)
ఉద్యోగం చేయొద్దని ఓ సీఆర్పీఎఫ్ జవాను భార్య చేయి నరికేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సతీష్ కుమార్ అనే వ్యక్తి సీఆర్పీఎఫ్ జవానుగా పని చేస్తున్నాడు. అతడి భార్య కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తుంది. అయితే, తన భార్య ఉద్యోగం చేయడం ఏమాత్రం ఇష్టం లేని సతీశ్ కుమార్.. భార్యకు పలుమార్లు చెప్పారు. కానీ, ఆమె భర్త మాటను పెడచెవిన పెట్టారు. ఈ క్రమంలో ఆమె ప్రమోషన్ కోసం అర్హత పొందేందుకు పరీక్ష రాయాలని ఢిల్లీకి శుక్రవారం మధ్యాహ్నం భర్తతో కలిసి వెళ్లింది. 
 
ఢిల్లీలోని ఆదర్శ్ నగర్‌లోని ఓ చిన్న హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ వారి మధ్య ఉద్యోగం విషయంపై మళ్లీ గొడవ జరిగింది. కొంత సమయం తర్వాత సర్దుకునిపోయి, హోటల్ సిబ్బందితోనే భోజనం తెప్పించుకుని ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ భోజనంలో భార్యకు తెలియకుండా సతీశ్ కుమార్ మత్తు కలిపాడు. ఇది తెలియని ఆమె స్పృహ కోల్పోయింది. 
 
దీంతో ఆమెను మంచానిక కట్టేసి అరచేయి నరికేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఆ నొప్పితో ఆమె స్పృహలోకి వచ్చింది. లేచి చూసి తన పరిస్థితిని అర్థం చేసుకుని గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వచ్చారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న బాధితుడి కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు చిత్రపరిశ్రమకు అల్లు అర్జున్ గర్వకారణం : సీఎం కేసీఆర్