Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు బీజేపీ శ్రేణుల బంద్ : బండి సంజయ్‌కు గుండు పగులుద్ది

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (10:26 IST)
మేడ్చల్ మల్కాజిగిరిలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తెరాస, బీజేపీ కార్యకర్తల మధ్య మాటామాటా పెరగటంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై తెరాస కార్యకర్తలు దాడిచేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కార్పొరేటర్ శ్రావణ్‌ను ఆస్పత్రికి తరలించారు. 
 
కార్పొరేటర్‌పై దాడిని నిరసిస్తూ బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ దాడికి సంబంధించి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు మరో 15 మంది కార్యకర్తలపై మల్కాజిగిరి పోలీసులు కేసులను నమోదు చేశారు.
 
కాగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై టిఆర్‌ఎస్ కార్యకర్తలు దాడికి నిరసనగా సోమవవారం నాడు బిజెపి బంద్‌కు పిలుపునిచ్చింది. దీనిపై తెరాస ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మల్కాజ్‌గిరిలో అడుగు పెడితే గుండు పగులుద్ధి అంటూ హెచ్చరించారు. 
 
అదేవిధంగా, బండి సంజయ్‌కు దమ్ముంటే తన ముందు ఆరోపణలు చేయాలని సవాల్ విసిరారు. కాగా, బండి సంజయ్ స్థాయి కార్పొరేటర్‌కి ఎక్కువ.. ఎంపీకి తక్కువ అని విమర్శించారు. ఇప్పటి నుంచి బండి సంజయ్ భరతం పడతానన్నారు. అదేవిధంగా సంజయ్ రాసలీలలను త్వరలోనే మీడియా ముందు హెడతామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments