Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు బీజేపీ శ్రేణుల బంద్ : బండి సంజయ్‌కు గుండు పగులుద్ది

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (10:26 IST)
మేడ్చల్ మల్కాజిగిరిలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తెరాస, బీజేపీ కార్యకర్తల మధ్య మాటామాటా పెరగటంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై తెరాస కార్యకర్తలు దాడిచేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కార్పొరేటర్ శ్రావణ్‌ను ఆస్పత్రికి తరలించారు. 
 
కార్పొరేటర్‌పై దాడిని నిరసిస్తూ బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ దాడికి సంబంధించి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు మరో 15 మంది కార్యకర్తలపై మల్కాజిగిరి పోలీసులు కేసులను నమోదు చేశారు.
 
కాగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై టిఆర్‌ఎస్ కార్యకర్తలు దాడికి నిరసనగా సోమవవారం నాడు బిజెపి బంద్‌కు పిలుపునిచ్చింది. దీనిపై తెరాస ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మల్కాజ్‌గిరిలో అడుగు పెడితే గుండు పగులుద్ధి అంటూ హెచ్చరించారు. 
 
అదేవిధంగా, బండి సంజయ్‌కు దమ్ముంటే తన ముందు ఆరోపణలు చేయాలని సవాల్ విసిరారు. కాగా, బండి సంజయ్ స్థాయి కార్పొరేటర్‌కి ఎక్కువ.. ఎంపీకి తక్కువ అని విమర్శించారు. ఇప్పటి నుంచి బండి సంజయ్ భరతం పడతానన్నారు. అదేవిధంగా సంజయ్ రాసలీలలను త్వరలోనే మీడియా ముందు హెడతామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

లైలా లో లాస్ట్ హోప్ గా విశ్వక్సేన్ ఓకే చేశారు. : డైరెక్టర్ రామ్ నారాయణ్

ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ట్రైలర్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

తర్వాతి కథనం
Show comments