Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్బీ నగర్‌లో కొంప ముంచిన బర్త్‌డే పార్టీ - 45 మందికి కరోనా

Webdunia
ఆదివారం, 10 మే 2020 (17:14 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టే పట్టి.. తిరిగి పుంజుకున్నాయి. అయితే, ఈ కేసులన్నీ కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోనే నమోదవుతున్నాయి. 
 
ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్ వనస్థలిపురం ఏరియాలో ఈ కరోనా వైరస్ స్వైర విహారం చేసింది. ఇక్కడ నమోదైన కేసుల్లో 45 కేసులు కేవల ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. వీరందరూ ఓ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఫలితంగా వీరందరికీ ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఇటీవల సరూర్ నగర్ నివాసికి మలక్‌పేట్ గంజ్‌లో ఓ దుకాణం ఉంది. అప్పటికే ఆ వ్యాపారికి తన దుకాణంలో పనిచేసే వ్యక్తి ద్వారా కరోనా సోకింది. ఈ విషయం తెలియక పార్టీలో పాల్గొనడంతో అతడి మిత్రుడికి కూడా కరోనా వ్యాప్తి చెందింది. 
 
ఆ విధంగా మొత్తం 45 మంది కరోనా బారినపడ్డట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో రెండు కంటైన్మెంట్ క్లస్టర్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరిగింది. కొత్త కేసులు నమోదు కావడమే కాదు, ఎల్బీ నగర్ ఏరియాలో 15 కంటైన్మెంట్ క్లస్టర్లు కూడా ఏర్పడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments